వాలంటీర్లు ఎన్నికల్లో పాల్గొంటే చర్యలు..
Ens Balu
2
Vijayawada
2021-03-06 13:03:16
కృష్ణా జిల్లాలో మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వార్డు వాలంటీర్లపై తక్షణ చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏయంబీ ఇంతియాజ్ హెచ్చరించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో పాల్గొనే వాలంటీర్లపై ఫిర్యాదుల కోసం వాట్సప్ 8186038738 ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా ఎన్నికల్లో పాల్గొన్నట్టు కనిపిస్తే తక్షణమే ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ఫోటోలు, వీడియోలు పంపడం ద్వారా ఎన్నికల కమిషన్ పంపిస్తామని వివరించారు. అదేవిధంగా dpoelections2021 @gmail.com కు మెయిల్ ద్వారాకూడా ఫిర్యాదులు తెలుపవచ్చని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో విజయవాడ,మచిలీపట్నం రెండు మున్సిపల్ కార్పోరేషన్లు, నూజివీడు, పెడన మున్సిపాలిటీలు,నందిగామ,ఉయ్యురు, తిరువూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా వార్డు వా లంటీర్లుగా పనిచేస్తున్న వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం,రాజకీయ పార్టీల కు లబ్ధి చేకూర్చడం, ఓటర్లను ప్రభావితం చేయడం నిషేధించామన్నారు. ఫిర్యాదుల కోసం 24 గంటలూ పై నెంబరు పనిచేస్తుందని కలెక్టర్ వివరించారు.