హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం..
Ens Balu
2
Visakhapatnam
2021-03-06 19:27:21
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి కి సర్క్యూట్ హౌస్ లో ఘన స్వాగతం లభించింది. శనివారం మధ్యాహ్నం వారు విజయనగరం నుండి విశాఖపట్నం సర్య్యూట్ హౌస్ కు చేరుకున్నారు. పోలీసుల నుండి ప్రధాన న్యాయమూర్తి గౌరవ వందనం స్వీకరించారు. ఘన స్వాగతం పలికిన వారిలో జిల్లా జడ్జి జస్టిస్ ఎ. హరిహర నాదశర్మ, జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, నగర పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా, డిఐజి ఎల్. కాళిదాసు వెంకట రంగారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.ఎం.రెడ్డి, డిసిపి ఐశ్వర్య రస్తోగి, ఆర్.డి.వో.పెంచల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.