25నుంచి ఏపిపిఎస్సీ డిపార్టుమెంటల్ టెస్టులు..


Ens Balu
4
Srikakulam
2020-08-20 18:43:55

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపిపిఎస్సీ) ఈ నెల 25 నుండి డిపార్టుమెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి తెలిపారు. ఈ మేరకు గురు వారం ఒక ప్రకటన జారీ చేస్తూ 25వ తేదీ నుండి సెప్టెంబరు 1వ తేదీ వరకు డిపార్టుమెంటల్ పరీక్షలను ఆన్ లైన్ మరియు కేంద్రాలలో వ్రాత పద్ధతిలో నిర్వహిస్తుందని చెప్పారు. 29, 30 తేదీలలో ప్రభుత్వ సెలవు దినం, ఐచ్ఛిక సేలవు దినం కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఆయన పేర్కొన్నారు. పరీక్షలను జి.ఎం.ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు అండ్ టెక్నాలజి, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరల మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఆబ్జెక్టివ్ పరీక్షలు ఆన్ లైన్ ద్వారానే నిర్వహిస్తారని తెలిపారు. వ్రాత పద్ధతిలో నిర్వహించే పరీక్షలను ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని వివరించారు. ఏపిపిఎస్సీ సమకూర్చే బుక్ లెట్ లో జవాబులు వ్రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసారు.