టిడ్కో గ్రుహాలను త్వరగా పూర్తిచేయాలి..
Ens Balu
2
Kakinada
2021-03-09 16:02:08
తూర్పుగోదావరి జిల్లాలో టిడ్కో గృహాల లబ్ధిదారులకు ఎకౌంటు ఓపెనింగ్ చేసి, త్వరితగతిన లోన్ ప్రొససింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి బ్యాంక్ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో టిడ్కో గృహాలపై ప్రైవేటు బ్యాంకు ప్రతినిధులతో జేసి కీర్తి చేకూరి సమిక్షించారు.ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ టిడ్కో గృహాలకు సంబంధించి ప్రైవేటు బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. అకౌంట్ ఓపెనింగ్ కి సంబంధించి ప్రైవేట్ బ్యాంకులు కొంతమేర వెనుకబడి ఉన్నాయని ఆమె తెలిపారు.14 ప్రైవేటు బ్యాంకుల వారు లబ్ధిదారులు అందరిచేత ఈ నెల 12 నాటికి సేవింగ్ ఎకౌంటెంట్స్ ను,18నాటికి లోన్ ఎకౌంటుకు సంబంధించి డాక్యుమెంటేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాలని జేసి తెలిపారు.అనంతరం జేసి ఎకౌంట్ ఓపెనింగ్ లో ప్రైవేట్ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను బ్యాంకు ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మెప్మా పీడి కె శ్రీరమణి, ఎల్డిఎం జె షణ్ముఖ రావు, వివిధ ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.