మహేంద్ర గిరిపై శివరాత్రి నిషేధం..


Ens Balu
10
Mahendragiri
2021-03-10 11:31:14

మహేంద్ర గిరిపై ఇతర ప్రాంతాల వారికి శివరాత్రి దర్శనం నిషేధించామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఒడిషా రాష్ట్రం గజపతి జిల్లా రాయగడ బ్లాక్ మహేంద్ర గిరిలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే  భక్తులకు  నిషేదించినట్లు గజపతి జిల్లా కలెక్టర్ తెలిపారని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి ఎక్కువ మంది భక్తులు హాజరు కావడం జరుగుతుందని, నిషేధం ఉన్న సంగతి గమనించాలని కోరారు. కోవిడ్ రెండవ దశ వ్యాప్తిలో ఉన్నందున భక్తులు ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా జాతరకు వెళ్లరాదని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై శ్రద్ద వహిస్తూ శివరాత్రి జాతరకు వెళ్లవద్దని సూచించారు.