ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి..


Ens Balu
2
Vizianagaram
2021-03-10 15:47:10

ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం తన ఓటు హక్కును కుటుంభ సభ్యులతోపాటు కలిసి వెళ్లి వినియోగించుకున్నారు. విజయనగరంలోని మహారాజా కళాశాల పోలింగ్ బూత్ లో తన ఓటు మంత్రి వేశారు. తన సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సిలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రతీఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సాధారణ ప్రజల మాదిరిగానే క్యూలైన్ లో నిలబడే మంత్రి కుటుంబం మొత్తం తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.