శ్రీకాకుళం జిల్లాలో పురపాలక పోలింగ్ 71.52%..
Ens Balu
2
Srikakulam
2021-03-10 19:00:00
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ మునిసిపాలిటీలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో జరిగిన ఎన్నికలలో 71.52 శాతం పోలింగ్ నమోదైందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 65,473 మంది ఓటర్లు తమ ఓటు హక్కును నియోగించుకున్నారని అన్నారు. ఇచ్చాపురం పురపాలక సంఘం పరిధిలో 28,905 మంది ఓటర్లకు గాను 19,562 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకోగా, పలాస- కాశీబుగ్గ పురపాలక సంఘం పరిధిలో 42,836 మంది ఓటర్లకు గాను 31,356 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే పాలకొండ నగర పంచాయతీ పరిధిలో 19,809 మంది ఓటర్లకు గాను 14,555 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించు కున్నారని కలెక్టర్ స్పష్టం చేశారు. దీంతో ఇచ్చాపురంలో 67.68 శాతం, పలాస-కాశీబుగ్గలో 73.20 శాతం, పాలకొండలో 73.48 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని వెరశి 71.52 శాతం మంది ఓటర్లు తమ ఓటును వినియోగించు కోవడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. మూడు పురపాలక సంఘాల పరిధిలో ఓటు హక్కుపై అవగాహన పెరగడంతో 71.52 శాతానికి ఓటింగ్ చేరుకుంది.