శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు..
Ens Balu
3
Golugonda
2021-03-11 11:04:26
మమాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం ఐదగంటల నుంచి శివాలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శనాలు, అభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహిస్తున్నారు. నదీస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ముఖ్యంగా విశాఖజిల్లాలో అల్లూరి సీతారామరాజు స్వయంగా పూజలు చేసిన స్వయంభూ శివాలయాలైన ఏజెన్సీ లక్ష్మీపురంలోని నీలకంఠేశ్వరస్వామి, గొలుగొండ మండలంలోని దారమఠం శ్రీశ్రీశ్రీ ఉమాదారమల్లేశ్వర స్వామి, మాకవరంలోని మహా శివలింగాలకు భక్తులు విశేషంగా పూజలు నిర్వహిస్తున్నారు.ఈ మూడు ప్రాంతాల్లో నదులు నిత్యం ప్రవహిస్తుండటంతో భక్తులు శుద్ధి స్నానాలు ఆచరించి శివయ్యకు పూజలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం ఐదు గంటల నుంచి రేపు ఉదయం ఐదుగంటల వరకూ శివజాగారం చేసి స్వామిరి మరోసారి పూజలు చేసి శివ ప్రసాదం స్వీకరిస్తారు భక్తులు. ఈ మూడు ఆలయాల్లో ఈరాత్రికి శివజాగార ప్రత్యేక భజనలు ఏర్పాటు చేశారు.