మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సీఎంకి గిఫ్ట్..


Ens Balu
2
Tirupati
2021-03-14 18:28:49

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో ప్రజలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి మంచి గిఫ్ట్ ఇచ్చారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆదివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మీద ఉన్న నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీలతో అత్యధిక సీట్లను గెలిపించారన్నారు. వార్ వన్ సైడ్ అనే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్న రోజా.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాదులో రెస్ట్ తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వాళ్లు ఇక అక్కడే పరిమితమైతే మంచిదని హితవు పలికారు.  శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారని వ్యాఖ్యానించిన రోజా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎక్కడున్నారో వెతుక్కొని మరీ ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ఇంత అభిమానం పొందడం సీఎం జగన్‌కే మాత్రమే సాధ్యమైందని తెలిపారు. చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్‌కే సాధ్యమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయాలు సాధించవచ్చని మున్సిపల్‌ ఎన్నికలు నిరూపించాయని రోజా అన్నారు..