తూ.గో.జిల్లాలో ప్రశాంతంగా ఓట్ల లెక్కింపు..
Ens Balu
1
Kakinada
2021-03-14 18:46:17
తూర్పుగోదావరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగ ముగిసిందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కలెక్టర్ జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఓట్ల లెక్కింపు తో పాటు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎం.ఎల్.సి. కు జరుగుతున్న పోలింగ్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీలో ఓట్ల లెక్కెంపు ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. లెక్కింపుకు కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి లెక్కింపు కేంద్రంలో వెబ్ కేస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షించే విధంగా జిల్లా సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. అదే విధంగా జిల్లాలో ఉపాధ్యాయ నియోజకవర్గం శాసన మండలి స్ధానానిక జరుగుతున్న పోలింగ్ ప్రక్రియ సజావుగా జరుగుతుందన్నారు. జిల్లాలో 67 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మండలి ఎన్నికకు జరుగుతున్న పోలింగ్ తీరును కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ద్వారా డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు నేతృత్వంలో పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభించి, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిందన్నారు. అదే విధంగా ఏజెన్సి ప్రాంతాల్లో ఉ. 8 గంటల నుండి మ. 2 గంటల వరకు జరిగిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాకినాడ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన యంఎల్ సి ఎన్నికల కంట్రోల్ రూమ్ తో పాటు స్పందన కేంద్రంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబుతో కలిసి పరిశీలించారు. అదే విధంగా కాకినాడ వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి పోలింగ్ కేంద్రాన్నికాకినాడ ఆర్డిఓ ఏజి చిన్నకృష్ణతో సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెల్సుకున్నారు. అదే విధంగా ముమ్మిడివరం నగర పంచాయతీ కు సంబంధించి జియంసి బాలయోగి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని అమలాపురం ఆర్డిఓ హిమాన్షు కౌషిక్ తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.