సోమవారం నుంచి స్పందన మళ్లీ మొదలు..
Ens Balu
1
Vizianagaram
2021-03-14 20:06:33
విజయనగరం జిల్లాలో స్థానిక ఎన్నికల కారణంగా రద్దు చేసిన స్పందన ప్రజా వినతుల కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ డా ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ప్రజల నుంచి యధావిధిగా అర్జీలు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల కోడ్ కారణంగా ఇప్పటి వరకూ కార్యక్రమం రద్దు చేశామన్నారు. ఇపుడు ఎన్నికల కోడ్ కూడా పూర్తిగా ఎత్తివేయడంతో యధావిధిగా స్పందన కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు.