రేపు పొట్టి శ్రీరాములు జయంతి జరపండి..
Ens Balu
1
Srikakulam
2021-03-15 20:21:13
శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. మార్చి 16న అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురష్కరించుకొని ఈ ఉత్సవాలను జిల్లా, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జారీచేసిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, ఉత్సవాలను నిర్వహించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.