వినియోగదారులు చైతన్యమే ముఖ్యం..


Ens Balu
3
Tirupati
2021-03-15 22:47:04

వినియోగదారుడు తమ హక్కులపై అవగాహన కలిగివుండాలని, నేడు మనం జరుపుకుంటున్న  ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ముఖ్యవుద్దేశ్యమని జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక సి.ఎల్.ఆర్.సి.భవనంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం పురస్కరించుకుని  పౌరసరఫరాలు , తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ శాఖలు నేడు సంయుక్తం వినియోగదారులకు అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించగా ముఖ్య అతిధిగా జిల్లా వినియోగదారుల ఫోరమ్ అధ్యక్షులు రాజారెడ్డి పాల్గొని అవగాహన కల్పించారు. జిల్లా వినియోగదారుల ఫోరమ్, అధ్యక్షులు రాజారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో  వినియోగదారునికి అన్యాయం జరిగితే అతని నిరసన పోరాటంతో అక్కడ చట్టాలుగా 1962 లో రూపుదిద్దుకోవడం, వినియోగదారుని ప్రాముఖ్యత, అవసరాలు గుర్తించి ప్రపంచవాప్తంగా యు.ఎన్.ఓ. 1968 నుండి మార్చి 15 నుండి   అమలుకు శ్రీకారం చుట్టిందని అన్నారు. మనదేశం 1986 లో డిసెంబర్ 24 చట్టం తెచ్చి హక్కులను కాపాడటం జరుగుతున్నదని అన్నారు. వినియోగదారుడు తాను కొనుగోలు చేసిన వస్తువు నాణ్యత లోపిస్తే, పోరంను ఆశ్రయించి 30 రోజుల్లో పరిష్కారం చేసుకోవచ్చని రూ.5 లక్షల విలువ వరకు ఫీజు కూడా లేదని, కోటి రూపాయల విలువ అయితే జిల్లానుండే కేసు నమోదు చేయవచ్చని  అవగాహన కలిగియుండాలని అన్నారు. జిల్లా పౌరసరఫరాల అధికారి శివరామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఉచితంగా వచ్చే వస్తువులు తప్ప కొనుగోలు చేసిన వస్తువులు అది ప్రభుత్వం అయినా ప్రవేటు కంపెనీలయైనా హక్కులకోసం ఆశ్రయించ వచ్చని తెలిపారు. నేడు ప్రధానంగా అవగాహనతో పాటు ప్లాస్టిక్ వల్ల జరిగే అనార్థాలు, చట్టాలు చేసినా మనం మారాల్సివుందని, ఆరోగ్యమే లక్ష్యంగా వుత్పత్తులు వుండాలని అన్నారు.  తూనికలు, కొలతల అసిస్టెంట్ కమిషనర్ సుధాకర్ వివరిస్తూ తూనికల్లో మోసాలు జరిగితే తెలుపవచ్చని, శాఖ పరంగా తరచూ దుకాణాల్లో దాడులు చేసి కేసులు నమోదు చేసి వినియోగదారుడు నష్టపోకుండా చూస్తున్నామని తెలిపారు. అందుకు సంబంధించిన లీగల్ మెట్రాలజీ సాదారణ , ఎలక్ట్రానిక్ తూనికలు , త్రాసులు, లీటర్లు వంటీవి హాజరయిన వినియోగదారులకు మోసపోకుండా వుండే విధానం వివరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారిని హరిత మాట్లాడుతూ తినే  ప్రతి వస్తువుకు ఒక నిర్దేశిత కాలం వుంటుందని అది మీరుకొనే వస్తువుల పాకింగ్ పై నమోదు చేసివుంటుందని వినియోగదారుడు గమనించి కొనుగోలు చేయాలని, హోటల్ ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించాలని, అక్కడ సరిలేకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అప్పుడే వారికీ జరిమానా, శిక్షలు పడే అవకాశం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమలో సహాయ పౌర సరఫరాల అధికారులు  తిరుపతి ఝాణ్శీ లక్ష్మి స్వాగతోపన్యాసం చేసి ప్లాస్టిక్ అనార్థాలను వివరించగా, చిత్తూరు వెంకట్రామ్, సి.ఎస్.డి.టి.లు చంద్రిక, సురేంద్ర  అధికారులు పాల్గొన్నారు.
సిఫార్సు