జీవిఎంసీ కమిషనర్ టెక్నాలజీ సూపర్..


Ens Balu
1
Visakhapatnam
2021-03-17 21:04:47

యువ ఐఏఎస్ అధికారులు ఏ పనిచేసినా అది చాలా వైవిధ్యభరితంగా, వినూత్నంగానూ ఉంటుంది..ప్రజలకు చాల తక్కువ సమయంలో చేరుతుంది కూడా..మొబైల్ టెక్నాలజీ పుణ్యమాని ఇపుడు అది మరింత చేరువుగా మారుతోంది. సరిగ్గా అదే ఆలోచన చేశారు యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారిణి, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మి.. సుమారు 14 సంవత్సరాల తరువాత విశాఖ జీవిఎంసీ కి మేయర్ ఎన్నిక జరగబోతుంది. తమ తమ పార్టీ అభ్యర్ధులు ప్రమాణస్వీకారం ఎలా చేస్తారో చూడాలని చాలా మంది కుటుంబ సభ్యులకు ఎంతో ఉత్సాహంగా వుంటుంది. కానీ స్వయంగా అక్కడికి వెళ్లడానికి అవకాశం లేనివారికి, సుమారు 98 మంది కార్పోరేట్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యుల కార్యక్రమాన్ని విశాఖ నగర ప్రజలదరికీ నేరుగా చూపించాలనే సంక్షల్పంతో రేపు జరిగే కార్యక్రమాన్ని జీవిఎంసీ యూట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCxEFAwSRd6WH5TDY0-o-wlg/live  ద్వారా లైవ్ లో చూపించాలని సంకల్పించారు. దానికోసం ప్రత్యేక ఏర్పాట్లును చేయించి ఆ లింక్ ను ఒక రోజు ముందుగానే విశాఖ ప్రజలకు తెలియజేయశారు. దీనితో ఆ లింక్ ద్వారా తమవారి ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని వాళ్లు చూడంటంతో పాటు తమ తమ కుటుంబ సభ్యులకు కూడా చిరస్థాయిగా నిలిచిపోయేలా ఆ యూట్యూబ్ లింక్ ని పంపించుకునే వెసులుబాటుని కల్పించారు. సాధారణంగా అయితే వీరు ప్రమాణ స్వీకారం చేసిన వార్త మరుసటి రోజు అంటే 24 గంటలు గడిస్తే తప్పా పత్రికల్లో రాదు...ఎవరో గట్టిగా ప్యాకేజీలు ఇస్తే తప్పా వారి విజువల్స్ టీవీ ఛానళ్లలో కనిపించవు. కానీ కమిషన్ ఆలోచన ద్వారా మాత్రం అన్ని వర్గాల ప్రజలు రేపు జరగబోయే జివిఎంసీ మేరయ్ ఎన్నిక, కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం కూడా అందరూ లైవ్ లో తిలింకించే అశకాశం ఏర్పడనుంది. ఏది ఏమైనా యువ ఐఏఎస్ అధికారులు ఆలోచన సరళి ఏ స్థాయిలో వుంటుందనడానికి ఈ చిన్న టెక్నాలజీ ఈవెంట్ ఒక మచ్చుతునకగా చెప్పవచ్చు..అదే విషయాన్ని ఈఎన్ఎస్ లైవ్ ద్వారా కూడా అందరికీ ఒక రోజు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం...
సిఫార్సు