మేయర్ ఎన్నిక 10 నిమిషాలు..శుభాకాంక్షలు 60 నిమిషాలు..
Ens Balu
2
Visakhapatnam
2021-03-18 15:18:54
మహా విశాఖ నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక కేవలం 10 నిమిషాల్లోనే ఎన్నికల అధికారులు ముగించేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం గురువారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా పదే పది నిమిషాల్లో జరిగిపోయింది. ఉదయం 10.50 గంటలకు ఎన్నికల పరిశీలకులు ప్రవీణ్ కుమార్, జివిఎంసీ కమిషనర్ నాగలక్ష్మీ సెల్వరాజన్ లతో పాటు ఎన్నికలో గెలుపొందిన కార్పోరేర్లంతా జివిఎంసీ కౌన్సిల్ హాలులో కూర్చుకున్నారు. అప్పటికే ఎవరి పేర్లతో వారి సీట్ల వద్ద ప్రమాణ పత్రాలను ఉంచేలా అధికారులు ఏర్పాటు చేశారు. సరిగ్గా 11.55 నిమిషాలకు ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆవెంటనే 11.57 ఎన్నికల నియమ నిబంధనలను సభకు చదివి వినిపించారు. అనంతరం కార్పోరేటర్ల ప్రమాణ స్వీకారం తెలుగు, మరియు ఇంగ్లీషులో జరిగింది. ఆపై అత్యధిక మెజార్టీ వున్న వైఎస్సార్సీపీ కార్పోరేటర్లల నుంచి వంశీక్రిష్ణ శ్రీనివాస్ మేయర్ అభ్యర్ధికై గొలగాని వెంకట హరి కుమారి పేరును ప్రతిపాదించారని ఎన్నికల అధికారి ప్రకటించగానే మూజువాణి రూపంలో ఎన్నిక నిర్వహించారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో మేయర్ అభ్యర్ధిని పేరు ఎన్నికల అధికారి ఖరారు చేశారు. అదేవిధంగా డిప్యూటీ మేయర్ గా జియ్యాని శ్రీధర్ ను ఎంపిక చేశారు. ఈ తంతు మొత్తం పది నిమిషాల్లోనే ముగిసిపోయంది.. ఆపై ప్రోటో కాల్ ప్రకారం జివిఎంసీ మేయర్ అభ్యర్ధికి ప్రత్యేక డ్రెస్ వేసిన తరువాత, ఆమెను రాష్ట్ర మంత్రి ముత్తం శెట్ట శ్రీనివాసరావు పోడియంలో సాదరంగా తోడ్కొని వెళ్లి కూర్చో బెట్టి శుభాకంక్షాలు చెప్పారు. తరువాత ఒక్కొక్కరుగా నూతన మేయర్ కు బొకేలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. కాగా టిడిపి కార్పోరేట్లరు, జనసేన, స్వతంత్ర్య అభ్యర్ధుల కోసం ఒక వైపు, వైఎస్సార్సీపీ కార్పోరేటర్లకు మరో వైపు కౌన్సిల్ లో సీట్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ జాతీయ కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, ఎంపీలు ఎంవీవీ సత్యన్నారాయణ, డా.బి.సత్యవతి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పలనాగిరెడ్డి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణాబాబు, తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబు, ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్, దువ్వారపు రామారావు, బుద్దా వెంకన్న, పి.రవీంధ్రబాబు, జీవిఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.