25న ప్రెస్ అకాడమీ చైర్మన్ రాక..


Ens Balu
2
Srikakulam
2021-03-18 18:20:32

రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ ఈ నెల 25న జిల్లాకు రానున్నారు. జిల్లాలో రెండు రోజుల పాటు ఆయన పర్యటించనున్నారు.   మార్చి 24న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి 25న ఉదయం 05.40గం.లకు శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) కు చేరుకుంటారు. ఉదయం 05.50గం.లకు రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి ఉదయం 06.10గం.లకు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకొని జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం కానున్నారు.  ఉదయం 09.30గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 10.00గం.లకు అరసవల్లికి వెళతారు. అక్కడనుండి 11.00గం.లకు శ్రీకూర్మంకు  చేరుకుంటారు.  ఉదయం 11.30గం.లకు శ్రీకూర్మం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు శాలిహుండం చేరుకోనున్న ఆయన మధ్యాహ్నం 12.30గం.లకు శాలిహుండం నుండి బయలుదేరి 01.00గం.కు శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 03.30గం.లకు అతిథి గృహం నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు డా. బి.ఆర్.అంబేద్కర్ విశ్వ విద్యాలయంలో జర్నలిజం చేస్తున్న విద్యార్ధులు మరియు పాత్రికేయులతో సమావేశమవుతారు. సాయంత్రం 06.00గం.లకు ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మార్చి 26న ఉదయం 09.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి ఉదయం 10.00గం.లకు శ్రీముఖలింగం చేరుకుంటారు. 11.00గం.లకు శ్రీముఖలింగం నుండి బయలుదేరి మధ్యాహ్నం 12.00గం.లకు వంశధార ప్రోజెక్టు వద్ద జిల్లా అధికారులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 03.00గం.లకు వంశధార ప్రోజెక్టు నుండి బయలుదేరి సాయంత్రం 04.00గం.లకు  ఆర్ అండ్ బి అతిథి గృహానికి చేరుకోనున్న ఆయన రాత్రి 07.00గం.లకు ఆర్ అండ్ బి అతిథి గృహం నుండి బయలుదేరి 07.30గం.లకు శ్రీకాకుళం రైల్వేస్టేషనుకు చేరుకుంటారు. అక్కడ నుండి బయలుదేరి విజయవాడకు వెళ్లనున్నారు. 
సిఫార్సు