జివిఎంసీ మేయర్ కి గంట్ల సత్కారం..


Ens Balu
3
Visakhapatnam
2021-03-18 21:42:15

మహావిశాఖ నగరపాలక సంస్థకు మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన గొలగాని వెంకట హరి కుమారిని గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు సత్కరించారు. మేయర్ ఎన్నిక పూర్తయిన తరువాత ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. సుమారు 14ఏళ్ల తరువాత కొలువుదీరిన సభలో మహిళా మేయర్ గా రాణించి, విశాఖ ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు. దీర్ఘకాలికంగా పరిష్కారం కాకుండా ఉండిపోయిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అదేవిధం జర్నలిస్టుల నుంచి జీవిఎంసీకి, వైఎస్సార్సీపీకి ఎల్లప్పుడూ సహకారం వుంటుందని చెప్పారు. అత్యధిక సభ్యులు పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నందున జీవిఎంసీకి మహిళా మేయర్ గా మరింత వన్నతీసుకురావాలని గంట్ల ఆకాంక్షించారు. మేయర్ ను కలిసిన వారిలో స్వతంత్ర అభ్యర్ధి కందుల నాగరాజు తదితరులు ఉన్నారు.
సిఫార్సు