అలా చేస్తే పదిరెట్లు పెనాల్టీ వేయండి..
Ens Balu
2
Kakinada
2021-03-19 16:54:27
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తుంటే కొందరు కావాలనే పథకాన్ని తప్పుదోవపట్టిస్టున్నారని తూర్పుగోదవరి జిల్లా కలెక్టర్(అభివ్రుద్ధి) కీర్తిచేకూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు, సేవలు, ఫిర్యాదులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జెసీ మాట్లాడుతూ, ప్రభుత్వమే రోగులకు ఉచితంగా వైద్యం చేయడానికి లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటే అందులోకూడా కొన్ని ఆసుపత్రులు డబ్బులుు వసూలు చేయడం క్షమించరాని నేరమన్నారు. ఈ విషయంలో ఆరోగ్యశ్రీ కోర్డినేటర్ జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎక్కడైనా ఆరోగ్యశ్రీ రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే దానికి పదింతలు సదరు ఆసుపత్రి, సిబ్బంది నుంచి పెనాల్టీలు వసూలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అక్రమ వసూళ్లకు పాల్పడే సిబ్బందిపైనా ఆసుపత్రులపైన కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆయా ఆసుపత్రులను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పథకానికి లోబడి పనిచేయాలన్నారు. అలా పనిచేయని ఆసుపత్రులను గుర్తించాలన్నారు.ఇకపై ఎవరైనా ఆరోగ్యశ్రీ పథకంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే తొలుత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి (ఇన్చార్జి)డా. ప్రసన్న కుమార్, జిల్లా ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డా.పి రాధాకృష్ణ, రంపచోడవరం కోఆర్డినేటర్ డా పి.ప్రియాంక, జిల్లా మేనేజర్ కే నవీన్ పాల్గొన్నారు.