టంగుటూరి భావితరాలకు ఆదర్శం.. వీసి ప్రసాదరెడ్డి


Ens Balu
3
Visakhapatnam
2020-08-23 22:20:01

నిస్వార్ధ ప్రజాసేవకు నిలువెత్తు నిదర్శనంగా టంగుటూరి ప్రకాశం పంతులు నిలుస్తారని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. టంగుటూరి ప్రకాశం జయంతిని ఆదివారం  ఏయూ అకడమిక్‌ ‌సెనేట్‌ ‌మందిరంలో నిర్వహించారు. ముందుగా టంగుటూరి చిత్రపటానికి వీసీ ఆచార్య ప్రసాద రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ బ్రిటీషు వారికి ఎదురొడ్డి ప్రాణాలను సైతం దేశ స్వాతంత్య్రం కోసం అర్పించడానికి సిద్దపడిన ధీశాలిగా టంగుటూరి చరిత్రలో నిలచిపోయారన్నారు. ఆయన చూపిన ధైర్యం, తెగువ నేటి యువతకు ఆదర్శనమన్నారు. ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ది ఎంతో ఆదర్శనమన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య వి.క్రిష్ణమోహన్‌, ఇం‌జనీరింగ్‌ ‌కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఎన్‌ఎస్‌ఎస్‌ ‌సమన్వయకర్త ఆచార్య ఎస్‌.‌హరనాథ్‌, ‌డీన్‌ ఆచార్య ఎన్‌.‌సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.  
సిఫార్సు