ఏయూలో బిటెక్ హానర్స్ కోర్సులు..వీసీ ప్రసాదరెడ్డి
Ens Balu
5
Visakhapatnam
2020-08-24 20:03:47
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నైపుణ్యాలతో కూడిన విద్యను అందించే దిశగా సిలబస్ రూపకల్పన చేయడం జరుగుతోందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ అకడమిక్ సెనేట్ సమావేశం జరిగింది. సెనేట్ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అద్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ ముందకు సాగడం జరుగుతోందన్నారు. అన్లైన్ బోధన విధానాన్ని అవలంభించామన్నారు. వర్సిటీలోని పలు విభాగాలు వెబినార్లను సమర్ధవంతంగా నిర్వహించాయన్నారు. కోవిడ్ విపత్తు సమయంలో సైతం తమ విశ్వవిద్యాలయం ఆచార్యులు సమర్ధవంతంగా పరిశోధన ప్రాజెక్టలను సాధించడం శుభపరిణామమన్నారు. త్వరలో విశ్వవిద్యాలయం పూర్తిస్థాయిలో సేవలు అందించే దిశగా, విద్యార్థులకు తరగతులు, పరీక్షల నిర్వహణకు విభిన్న వ్యూహాలను అవలంభించడం జరుగుతోందని వివరించారు.