స్పందనకు 123 వినతులు..డీఆర్వో బి.దయానిధి


Ens Balu
4
Srikakulam
2020-08-24 20:16:11

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 123 వినతులు అందాయని డీఆర్వో బి.దయానిధి చెప్పారు.  ప్రతీ సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్, స్పందన కార్యక్రమాల్లో ప్రజల ఆర్జీలను భౌతికంగా కాకుండా ఫోన్ ద్వారా స్వీకరించేందుకు ప్రతీ సోమవారం ఉదయం 09.00గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు స్వీకరించామన్నారు. అందులో భాగంగా సోమవారం జరిగిన  ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాలకు చెందిన 123 మంది ఆర్జీదారులు తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి విన్నవించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ, ప్రజలు స్పందనలో చేసుకున్న అర్జీలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందించి అర్జీలను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేసినట్టు ఆయన వివరించారు.
సిఫార్సు