విశాఖ నగర పరిధిలో వార్డుకో పీహెచ్సీ...జిల్లా కలెక్టర్


Ens Balu
2
Visakhapatnam
2020-08-24 20:31:44

విశాఖనగర పరిధిలోని ప్రతి వార్డుకు అర్బన్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం అర్భన్ వైద్యసేవలసై అధికారులతో సమీక్షించారు. అర్భన్ పీహెచ్సీల్లో ఇద్దరు డాక్టర్లు, సిబ్బందిని నియమించి, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.   టెస్టులు గ్రామ, వార్డు స్థాయినుండే నిర్వహించాలన్నారు.  గ్రామీణంలో ఆశ వర్కర్లు సేవలు ఉపయోగించుకోవాలన్నారు.  సచివాలయాలలో ఇంటర్నెట్ సదుపాయలు ఏర్పాటుచేసి, డిజిటల్ అసిస్టెంటు ద్వారా డేటా నమోదు చేయించాలన్నారు.  డిజిటల్ అసిస్టెంటు లేకపోతే తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలన్నారు. పనులన్నీ సత్వరమే చేయాలని జిల్లా అధికారులను ఆదేశించిన ఆయన ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వైద్యసిబ్బంది, అధికారులు పనిచేయాలన్నారు.
సిఫార్సు