ఆ అధికారులు కక్షగట్టి రూ.215 కోట్లు పెనాల్టీ వేశారు..
Ens Balu
4
2020-08-25 18:56:29
రాజకీయంగా కక్షగట్టి లక్షల్లో గ్రానైట్ వ్యాపారం చేసేవారిని ప్రభుత్వ అధికారులు రూ.215 కోట్ల రూపాయాలు పెనాల్టీ కట్టమనడం ఎంతవరకూ సమంసజమని ఎంఎస్పీ గ్రానైట్ అధినేత పళనివేల్ ప్రశ్నించారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టెక్కలి నియోజకవర్గంలో లింగాలవలస గ్రామంలో గ్రానైట్ క్వారీ విజిలెన్స్ ఎస్పీ పనసా రెడ్డి ఆధ్వర్యంలో 2019 డిసెంబరులో తనిఖీ నిర్వహించారు3 రోజులపాటు నిర్వహించిన సర్వేలో కేవలం 26క్యూబిక్ మీటర్ల వరకు పెనాల్టీ వేశారన్నారు. దీంతో తాము హైకోర్టుకి వెళితే అక్కడ తమకు న్యాయం జరిగి1400 క్యూబిక్ మీటర్లకే పెనాల్టీ వేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. తరువాత హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ ఇద్దరు అధికారులు కక్షగట్టి ఈరోజు కూడా సర్వేచేసి ఇపక్కక్వారీలన్నింటికి కలిపి ఒక్కరినే పెనాల్టీ కట్టాలని వేధించడం బావ్యంకాదని అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరుపుతారని కుటుంబాలకు ఆదుకుంటారని కోరుతున్నామని ఎం ఎస్ పి గ్రానైట్ అధినేత పళని వేల్ తెలిపారు.