కరోనా వైరస్ కేసులు అధికంగా పెరుగుతున్న సమయంలో సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అధికారులు అనునిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నారు. అంతేకాకుండా సామాజిక దూరాన్ని అమలు చేస్తూ..స్వామివారి దర్శనాన్ని కలిగిస్తున్నారు. వీటి కోసం దేవస్థానంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీనితో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ భక్తులు దేవస్థానంలో స్వామిని దర్శించుకుంటున్నారు.