కోవిడ్ ఆసుపత్రుల ఆక్సిజన్ కి రూ.80 లక్షలు..


Ens Balu
1
కలెక్టరేట్
2021-05-03 14:00:46

విశాఖ జిల్లాలో కోవిడ్ ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపడుతున్న వివిధ జాగ్రత్తలలో భాగంగా దివీస్ ల్యాబ్ నుండి వివిధ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా నిమిత్తం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ కు జనరల్ మేనేజర్ కోటీశ్వరరావు సుమారు 80 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.  సోమవారం కలెక్టరేట్ లోని ఆయన చాంబర్ లో అందించి, విశాఖ ఇండస్టియల్ గ్యాసెస్ నుండి వివిధ ఆసుపత్రులకు ఇప్పటికే 350 సిలిండర్లు సరఫరా చేసినట్లు తెలిపారు.  కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బలిటీ కింద ఈ ఆక్సిజన్ సిలిండర్లు ను సరఫరా చేస్తున్నట్లు వివరించారు.దివీస్ ల్యాబ్ లేటరీ నుండి సి.ఎస్.ఆర్. మేనేజర్ డి. సురేష్ కుమార్, పి. అశోక్ మరియు సీనియర్ లైజన్ కన్సల్టెంట్  వరహాలరెడ్డి గారు పాల్గొన్నారు.
సిఫార్సు