హిందూపురంలో వైద్య సిబ్బంది నియామకం..


Ens Balu
2
హిందూపురం
2021-05-03 15:09:11

 కరోనా బాధితులకు మెరుగైన చికిత్సను అందించే నిమిత్తం ప్రస్తుతం సేవలు అందిస్తున్న సిబ్బందికి అదనంగా వైద్య సిబ్బందిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 
 ఒక జనరల్ డ్యూటీ డాక్టర్, ఒక పీడియాట్రిషియన్,18 మంది స్టాఫ్ నర్సులు, 10 మంది ఎఫ్ఎన్ఓ-ఎంఎన్ఓలు, 5 మంది హౌస్ సర్జన్ లతో కూడిన 32 మంది వైద్య సిబ్బందిని కలెక్టర్ నియమించారు. తాజాగా నియమించిన సిబ్బంది నేటి సాయంత్రం లోపు హిందూపురం జిల్లా ఆసుపత్రిలో విధుల్లో చేరతారని కలెక్టర్ తెలిపారు. 

 హిందూపురం జిల్లా ఆసుపత్రిలో జెనరల్ డ్యూటీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న డా. రాజ గోపాల్ కు సహాయకుడిగా మడకశిర సీహెచ్సీ పీడియాట్రిషియన్ డా. ప్రేమ్ కుమార్ వ్యవహరించనున్నారు. హిందూపురం జిల్లా ఆసుపత్రితో పాటు కదిరి, గుంతకల్లు ఏరియా ఆస్పత్రులలోను 10 మంది ఎమ్ఎన్వోలు, ఎఫ్ఎన్ఓ ల నియామకం చేపట్టారు. గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో నలుగురు ఎమ్ఎన్వోలు, ఒక ఎఫ్ఎన్ఓ.. కదిరి ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు ఎమ్ఎన్ఓలు, ఇద్దరు ఎఫ్ఎన్ఓలను నియమించడం జరిగిందన్నారు.

సిఫార్సు