ఈవీఎంల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఎన్నికలు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును కలెక్టర్ మురళీధర్రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గనిర్దేశాల మేరకు
ఎప్పటికప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ (సంక్షేమం), డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం.జగన్నాథం, కాకినాడ అర్బన్ డీటీ రమేశ్,తదితరులు పాల్గొన్నారు.