వేక్సినేషన్ తోనే కరోనాను తరిమికొట్టాలి..


Ens Balu
1
చినవాల్తేరు
2021-05-05 10:13:19

విశాఖ మహానగరంలో ప్రభుత్వం నిర్ధేశించిన వారంతా ఖచ్చితంగా కోవిడ్ వేక్సిన్ వేసుకొని కరోనాను తరమికొట్టాలని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షలు వంశీక్రిష్ణ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చినవాల్తేర్ చిన్న హాస్పిటల్(ప్రాథమిక ఆరోగ్య  కేంద్రం) వద్ద గల కోవిడ్ వ్యాక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. కోవిడ్ వ్యాక్షన్ తీరుపై స్థానిక వైద్య సిబ్బందిని మరియు స్థానిక ప్రజలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కరోనా ఉధృతి, కేసులు ఎక్కువగా వున్న నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలన్నారు.  ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు , సానీటైజర్లు వినియోగిస్తూ వ్యక్తిగత దూరం పాటించాలని అన్నారు. 45 సంవత్సరాలు దాటిన వారికి వాక్సినేషన్ లో ప్రాధన్యత ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వార్డు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
సిఫార్సు