కరోనా సేవకు పాహనోక్ ముందడుగు..


Ens Balu
2
Siripuram
2021-05-08 09:35:11

విశాఖ మహానగరంలో కరోనా కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా తమవంతు సహకారం అందించేందుకు జీవీఎంసీ 45 వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపాహనోక్  ముందుకొచ్చారు. విశాఖలో శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు  విజయ సాయి రెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భారతి ఫౌండేషన్  ద్వారా కరోనా రోగుల కోసం నిర్వహిస్తున్న 200 పడకల ఆక్సిజన్ సెంటర్ కు రూ. 5 లక్షల అందజేశారు. 
ఈ సందర్భంగా సాయి రెడ్డి మాట్లాడుతూ ప్రగతి భారతి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వాముల అయ్యేందుకు ఎవరైనా ముందుకు రావచ్చన్నారు. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరూ ఐక్యం కావాలని కోరిన ఆయన కరోనా రోగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపి ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  జీవీఎంసీ డిప్యూటీ  ఫ్లోర్ లీడర్ హనోకు మాట్లాడుతూ తన తల్లి, తన సోదరుడు కరోనా వలనే మరణించారని, ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అందరం ఐక్యంగా పోరాటం చేయాలనే సదుద్దేశంతోనే తాను ఈసేవకు ముందుకు వచ్చానన్నారు. 
సిఫార్సు