సచివాలయ పరీక్షకు 1.50 లక్షల మంది..జిల్లా కలెక్టర్
Ens Balu
3
Visakhapatnam
2020-08-27 17:03:51
గ్రామ సచివాలయాలలో గల ఖాళీల భర్తీకి సెప్టెంబరు 20 నుండి 26 తేదీవరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పక్కాగా చేయాలని జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. గురువారం పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. పరిక్షలకు సుమారు లక్షాయాబది వేల మంది హాజరగుచున్నారని, పరీక్షల నిర్వహణకు 8 క్లస్టర్లుగా విభజించి, 330 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలియజేసారు. ఈ సంధర్బంగా అధికారులకు కలెక్టరు పలు సూచనలు చేసారు. పరీక్షలకు కావలసిన ట్రంకు బాక్సులు, ఇతర మెటీరియల్ వెంటనే సమకూర్చుకోవాలన్నారు. సెప్టెంబరు 1 తేదీకి కావలసిన మెటీరియల్ తెప్పించుకోవాలని తెలిపారు. స్ట్రాంగు రూం లేఅవుట్ తీసుకోవాలని, మెటీరియల్ పంపిణీలో గందరగోలం లేకుండా చూసుకోవాలన్నారు. శాటిలైట్ స్ట్రాంగ్ రూం లకు 18వ తేదీనే మెటీరియల్ పంపించాలని సూచించారు. పరీక్షరోజున స్ట్రాంగ్ రూం నుండి మెటీరియల్ పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరే విధంగా రూట్ మ్యాప్, ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా ఉండదని, దానిని బట్టి ఏర్పాట్లు చేయాలన్నారు. అవసరమైన వాహనాలు సమకూర్చు కోవాలని తెలిపారు. పరీక్షల నిర్వహణలో పాలుపంచుకొనే శాఖలన్నిటిని సమన్వయం చేసుకొని పరీక్షల నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణపై ఇతర శాఖలతో సమావేశం నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం .సి . కమీషనరు జి. సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎన్.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, జిల్లా పరిషత్ సిఈవో నాగార్జునసాగర్ జిల్లా పంచాయతీ అధికారి, ఆంధ్రా యూనివర్శిటీ, ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పాల్గొన్నారు