రైతు బజార్ల వద్ద జర భద్రం సుమీ..


Ens Balu
2
Visakhapatnam
2021-05-12 05:56:22

కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా వున్న తరు ణంలో రైతుబజార్లకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తలు పాటించాలని అర్భన్ తహశీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు. ఈమేరకు బుధవారం ఆమె మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ ఉద్రుతి అధికంగా ఉన్నందున ప్రతీ ఒక్కరూ డబుల్ లేయర్ వున్న మాస్కులు ధరించాలన్నారు. బౌతిక దూరం పాటిస్తూ, రైతుబజార్లలో కావాల్సిన కూరగాయలు కొనుగోలు చేసుకోవాలన్నారు. సాధ్యమైనంత వరకూ హేండ్ గ్లౌజులు, శానిటైర్లు వినియోగించడం ద్వారా వైరస్ నుంచి రక్షణ పొందడానికి ఆస్కారం వుంటుందన్నారు. జనసాంధ్రత సాధారణంగా అత్యధికంగా వుండే ఈ ప్రాంతాల్లో ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలుపడుతుందన్నారు. వారానికి సరపడే కూరగాయలన్నీ ఒకేసారి కొనుగోలు చేసుకోవడం ద్వారా నిత్యం రైతు బజార్లకు వెళ్లే అవకాశం వుండదని, అదే సమయంలో బయటకు వెళ్లే అవసరం కూడా తప్పుదందని తహశీల్దార్ సూచిన్నారు. అదే సమయంలో కొనుగోలు చేసిన కూరగాయలను  కూడా ఇంటి బయటనే ఒక సారి ముందుగా మంచినీటితో శుభ్రం చేసుకొని అపుడు మాత్రమే ఇంటిలోకి తీసుకెళ్లాలన్నారు. 60ఏళ్లు దాటిన వారు జనసాంధ్రత ఉన్న ప్రదేశాలకు పంపడం మానుకోవాలని జ్నానవేణి నగరవాసులకు సూచిస్తున్నారు.
సిఫార్సు