అందరి సహకారం, సమిష్టి కృషితోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యమ వుతుందని సింహాచలం దేవస్థానం ఈవో ఎంవీ సూర్య కళ అన్నారు. బుధవారం సింహ గిరిపైన ఆనందనిలయంలో అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితుల పదవీ ప్రమాణ బాధ్యతలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సూర్య కళ ప్రత్యేక ఆహ్వానితులు అందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. చందనోత్సవం పర్వదినం ముందు స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం, ఉత్సవము ముందు బాధ్యతలు స్వీకరించడం అంతా స్వామి వారి కృప గా పేర్కొన్నారు. భవిష్యత్తులో అందరం కలిసి ఆలయ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేద్దామని ఈఓ పిలుపునిచ్చారు. సింహాద్రి నాధుడు ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీనుబాబు, మేడిది మురళీకృష్ణ, యండమూరి విజయ, డి.మాణిక్యాలరావు ఎస్ ఎన్ రత్నం, లను ఘనంగా సత్కరించి ఈఓ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులు అంతా మాట్లాడుతూ, తాము పూర్తిస్థాయిలో స్వామివారి సేవకు అంకితమవుతామని చెప్పారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులు అంతా కలిసి సింహాచలం అన్నదానం, గోసంరక్షణ పథకానికి లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. ఇందుకు సంబంధించిన చెక్కులు ఆలయ ఈవోకు ఇచ్చి త్వరలో మరిన్ని పధకాలు కి తమ వంతు విరాళాలు అంద చేస్తామని చెప్పారు.
పూర్వ జన్మ సుకృతము
..గంట్ల శ్రీనుబాబు
సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం ఎంతో సంతోషం కలిగించింది అని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు అన్నారు. గతంలో తాను సింహాచలం దేవస్థానం చందనోత్సవం కమిటీ సభ్యునిగా స్వామి సోదరి శ్రీ పైడితల్లి అమ్మవారి
ఉత్సవ కమిటీ సభ్యుడిగా పలు మార్లు సేవలు అందించామన్నారు. అంతే కాకుండా మరో సోదరి శ్రీ సత్తమ్మ తల్లి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ కూడా స్వామి ధర్మ కర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులు కావడం పూర్తి పూర్తిస్థాయిలో సంతోషం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ ఏఈ వో కేకే రాఘవ కుమార్రమణమూర్తి,చిట్టి తదితరులు పాల్గొన్నారు.