కరోనాలో నర్సులే అసలైన కుటుంబ సభ్యులు..


Ens Balu
2
Visakhapatnam
2021-05-12 15:28:13

కరోనా సమయంలో నర్సులే రోగులందరికీ కుటుంబ సభ్యులై ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నారని జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని బుధవారం  11వ వార్డు ఆరిలోవలోని ఎఫ్.ఆర్.యు. ఆసుపత్రి నర్సులు, సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నర్సులు కోవిడ్ పేషంట్లకు చేస్తున్న సేవలకు ప్రణమిల్లాలని, ఇదే స్ఫూర్తితో మరింత మంది కోవిడ్ పేషంట్లకు సేవలు అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం, వైద్యాధికారి డా. అనిత ఆధ్వర్యంలో నర్సులు, సిబ్బందికి సన్మానించారు. డా. అనిత, నర్సింగు సిబ్బంది మాట్లాడుతూ , వ్యాక్సినేషన్, కోవిడ్ సేవలతో నెలలు తరబడి అవిశ్రాంతంగా గడుపుతున్న తమ సిబ్బందికి మేయర్ సత్కరించడం, శుభాకాంక్షలు తెలుపడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరిలోవ ఎఫ్.ఆర్.యు. వైద్యాధికారి డా. అనిత, నర్సింగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   
సిఫార్సు