ఆక్సిజన్ ప్లాంట్ పనులు వేగవంతం..


Ens Balu
2
Srikakulam
2021-05-12 15:31:17

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంటు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు.  సర్వజన ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణం పనులను జిల్లా కలెక్టర్ బుధవారం పరిశీలించారు. నాగార్జున అగ్రికమ్ సౌజన్యంతో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఎన్. ఏ.సి.ఎల్ లో ప్రస్తుతం ఉన్న ప్లాంటుకు ప్రస్తుత అవసరాలకు తగిన విధంగా రూ.25 లక్షల ఖర్చుతో ఎన్. ఏ.సి.ఎల్ మార్పులు చేసింది. ఆ యూనిట్ ని సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. జిజిహెచ్ లో ప్లాంటు నిర్మాణ పనులను జాతీయ రహదారుల సంస్థకు అప్పగించారు. జిజిహెచ్ లో ప్లాంటుకు విద్యుద్దీకరణ, పైపులు అమర్చే పనులు జరుగుతున్నాయి. డ్యూయల్ లైట్ అనే అనుసంధాన (అబ్జార్వెంట్) పరికరం టాటా కెమికల్స్ నుండి తెప్పిస్తున్నారు. ఈ ప్లాంటు ద్వారా గంటకు 40 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఆక్సిజన్ ప్లాంట్ త్వరిత గతిన నిర్మాణం చేపట్టే దిశగా కాంట్రాక్టర్ కి  సలహాలు సూచనలు ఇవ్వాలని ఎన్. ఏ.సి.ఎల్ ఉపాధ్యక్షులు సి.వి.రాజులును కోరారు. ఈ సందర్భంగా జిజిహెచ్ లో నావల్ డాక్ యార్డు ఆధ్వర్యంలో అమర్చిన పైపు లైన్లను,  ఆక్సిజన్ సరఫరా తీరును పనితీరును కలెక్టర్ నివాస్ పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలని సిబ్బందికి  సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు  సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఏపిఈడబ్ల్యూఐసి ఇఇ కె.భాస్కరరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సి.హెచ్.కృపావరం, సహాయ డిఎఫ్ఓ శ్రీను బాబు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ఏపిఎంఐడీసీ డిఇ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సిఫార్సు