మహావిశాఖ నగర పరిధిలో వైద్య ఆరోగ్యశాఖ గుర్తించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ వేక్సిన్ 2వ డోసు వేస్తున్నట్టు డీఎంహెచ్ఓ డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. అల్లిపురం,బుచ్చిరాజుపాలెం, వన్ టౌన్,రామమూర్తి పంతులు పేట,సాగర్ నగర్,తగరపువలస,విద్యుత్ నగర్, గాజువాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ద్రోణంరాజు కళ్యాణమండపం,డ్రైవర్స్ కాలనీ),మధురవాడ,.పట్టణ కుటుంబ సంక్షేమ కేంద్రం.అనకాపల్లి..చినవాల్తేరు, స్వర్ణభారతి,అరిలోవ,శ్రీహరిపురం, పెందుర్తి పీహెచ్సీల పరిధిలోని ప్రజలు కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు.