42 రోజులు దాటిన వారికే రెండో డోసు..
Ens Balu
2
Vizianagaram
2021-05-12 15:34:49
కోవిషీల్డ్ మొదటి డోసు వేసుకొని 42 రోజులు దాటిన వారికి మాత్రమే రెండోడోసు వేయడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిబంధనలు ప్రకారం, కోవిషీల్డ్ మొదటి డోసు వేసిన ఆరు వారాలు లోపు వేక్సిన్ వేయడం జరగదని స్పష్టం చేశారు. అందువల్ల మొదటి డోసు వేసుకొని 42 రోజులు పూర్తి అయినవారు మాత్రమే గురువారం నుంచి వేక్సిన్ కేంద్రానికి వెళ్లాలని సూచించారు. వేక్సిన్ వేయాల్సిన వారికి ముందుగానే ఏఎన్ఎం ద్వారా సమాచారం అందుతుందని, ఒకవేళ సమాచారం రానప్పటికీ, 42 రోజులు పూర్తి అయినవారు, తమ ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి వేక్సిన్ వేయించుకోవచ్చని తెలిపారు. ఇంతకుముందు మొదటి డోసు వేసుకున్న కేంద్రాలకు అనుబంధంగా, వాటికి సమీపంలోని పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలలో వేక్సిన్ వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి కోవెగ్జిన్ స్టాకు లేదని, వచ్చిన తరువాత, ప్రత్యేకంగా దీనికోసం ఏర్పాటు చేసిన ఆయా వేక్సిన్ కేంద్రాలలో 28 రోజులు దాటినవారికి రెండో డోసు వేయడం జరుగుతుందని ఒక ప్రకటన ద్వారా జేసీ తెలిపారు.