నర్సుల సేవలు సమాజానికి అవసరం..


Ens Balu
3
VIMS Hospital
2021-05-12 15:37:45

ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్స్ ల సేవలతోనే కోవిడ్ రోగులకు పునర్జన్మ కలుగుతోందని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. బుధవారం విశాఖని విమ్స్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంజిలిన్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో నర్సులు తమ ప్రాణాలను పణంగా పెట్టి రోగులకు సేవలు అందిస్తున్నారని అన్నారు. సమాజానికి నర్సులు సేవలు ఎంతో అవసరని అన్నారు.  స్టాఫ్ నర్సులు,నర్సింగ్ సిబ్బందికి మేయర్ శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసి మేయర్ స్వయంగా స్టాఫ్ నర్స్ లకు తినిపించారు. ఉత్తమ సేవలు అందిచిన నర్సులు కు ఘనంగా సన్మానం చేశారు.  విమ్స్  డైరెక్టర్ డా రాంబాబు మాట్లాడుతూ  నర్సుల దినోత్సవ విశిష్టత ను వివరించారు. కరోనా ప్రారంభం నుంచి నర్సులు అందిస్తున్న సేవలు అద్భుతమని వారిని గౌరవించాలని మేయర్ రావటం సత్కరించటం స్ఫూర్తి దాయకం అన్నారు. మేయర్ చేసిన ఈ సన్మాన కార్యక్రమం ద్వారా అనేక నెలలుగా నిస్సత్తువ తో వున్న నర్సింగ్ సిబ్బందికి నూతన ఉత్తేజం కలిగిందన్నారు. ఈ సందర్భంగా మేయర్  ఆలోచనలు కు, ఆమె అభిమానానికి  వైద్యులు, నర్సులు అభినందనలు కురిపించారు.  ఈ కార్యక్రమములో గొల గాని శ్రీనివాస్,అధిక సంఖ్యలో వైద్య సిబ్బంది నర్సులు పాల్గొన్నారు.