విశాఖజిల్లాలో ఎంపిక చేసిన 37 ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో రెండవ డోసుగా కోవిషీల్డు వ్యాక్సిన్ మాత్రమే అందిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.పతివాడ సత్యసూర్యనారాయణ తెలియజేశారు. విశాఖలో బుధవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మొదటి డోసు వేసుకున్న వారికి మాత్రమే రెండవ డోసు వేస్తున్నట్టు చెప్పారు. ఎవరికీ మొదటి డోసు వేయడం లేదన్నారు. ఈ విషయాన్ని గమనించి కేవలం టోకెన్లు పొందిన లేదా మెసేజ్ వచ్చిన వారు రెండవ వేక్సిన్ వేయించుకోవడానికి మాత్రమే రావాలని ఆయన కోరారు. చాలా మంది మొదటి డోసు వేయమని కేంద్రాలకు వస్తున్నారని, కానీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రెండవ డోసు మాత్రమే వేస్తున్నట్టు డిఎంహెచ్ఓ తెలియజేశారు.