ఆక్సిజన్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి..


Ens Balu
2
Peddapuram
2021-05-12 15:41:33

పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో మూతబడిన ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ ను పునరుధ్ధరించే విధంగా యుధ్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ పేర్కొన్నారు. ఆక్సీజన్ జనరేషన్ ప్లాంట్ పునరుధ్ధరణ పనులపై జాయింట్ కలెక్టర్ లక్ష్మిశ, ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్. టి.గాయత్రీ దేవి, ఎస్.ఇ., ఏ.పి.ఎస్.పి.ఇ.పి.డి.సి.ఎల్., వేదాంత, మేఘా ఇంజనీరింగ్ ప్రతినధులతో బుధవారం జూమ్ యాప్ ద్వారా వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ బాధితులకు అవసరమైన ఆక్సీజన్ సామర్ధ్యం పేంచే విధంగా పెద్దాపురంలో మూసివేసిన ఆక్సీజన్ జనరేటర్ ప్లాంట్ పునరుధ్ధరణ కోసం అవసరమైన సాంకేతిక పరిజ్ఞాన సహాయం వివిధ సంస్ధల నుండి తీసుకొనే విధంగా కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమైందన్నారు. 2014 నుండి మూసి వేయాబడిన ఆక్సీజన్ ప్లాంట్ ను పునరుధ్ధరించుకోవడంలో భాగంగా అవసరమైన సాంకేతిక పరికరాలను ఆయా సంస్ధల నుండి రప్పించే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా వేతాంద, మేఘా ఇంజనీరింగ్ సంస్ధల సహకారం తీసుకొంటున్నామన్నారు. ప్లాంట్ కు కావలసిన విద్యుత్, నీటి సరఫరాను ఆయా విభాగాల సూపరింటెండెంట్ ఇంజనీర్లు పర్యవేక్షించే విధంగా సూచించడం జరిగిందన్నారు. ఈ పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలని ఎస్.ఇ., ఆర్.డబ్ల్యూ.ఎస్., ఎస్.ఇ., ఏపిఎస్.పి.డి.సి. ఇంజనీర్లకు జేసి సూచించారు. వేదాంత ప్రతినిధి ముత్తు కుమార్ స్వామి ప్లాంట్ పునరుధ్ధరణకు అవసరమైన సాంకేతిక నిపుణులను సప్లై చేస్తున్నట్లు జూమ్ విసి ద్వారా తెలిపారు. అదే విధంగా మేఘా ఇంజనీరింగ్ సంస్ధ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ కిర్లోస్కర్ కంప్రెషన్ సాంకేతిక నిపుణులు అవసరమైన హెల్పర్లు ఏర్పాటు చేసి విధంగా సంప్రదింపులు చేస్తున్నట్లు తెలిపారు.  జిల్లాలో కోవిడ్ బాధితులకు ఆక్సీజన్ సరఫరా పూర్తి స్ధాయిలో అందించే విధంగా వివిధ శాఖలతో పాటు ఇతర రంగాలకు చెందిన వారి సమన్వయంతో పనులు పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పిఓ ఐటిడిఏ ప్రవీణ్ ఆదిత్య , పెద్దాపురం ఆర్.డి.ఓ. ఎస్.మల్లిబాబు, ప్లాంట్ పునరుధ్ధణ పనులు పర్యవేక్షిస్తున్నారని జేసి లక్ష్మిశ పేర్కొన్నారు. 
సిఫార్సు