ఉద్యోగులకు, జర్నలిస్టులకు ప్రత్యేక బెడ్లు..


Ens Balu
2
Anantapur
2021-05-12 15:51:45

కోవిడ్ సోకిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు పడకలు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.   కరోనా బారిన పడిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ శాఖ అధికారులు, పోలీసులు, జర్నలిస్టులకు అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు బత్తలపల్లి ఆర్డీటీ, అనంతపురము సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఒక్కో ఆసుపత్రిలో 30 పడకల చొప్పున మొత్తం 60 పడకలు కేటాయించామన్నారు. సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, కోవిడ్ విధులు నిర్వహిస్తున్న వీరు కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతుండటంతో ఆసుపత్రులలో వీరికి కొన్ని పడకలు రిజర్వ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 
 
సిఫార్సు