ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు..
Ens Balu
6
Visakhapatnam
2020-08-27 18:32:15
ప్రభుత్వం భూముల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నదని జిల్లా కలక్టరు తెలిపారు. గురువారం రెవిన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ మద్య కాలంలో భూ ఆక్రమణలకు సంబంధించి ఎక్కువ పిర్యాదులు అందుతున్నాయని, వాటిని ఎట్టిపరిస్థితులలోను ఉపేక్షించకూడదన్నారు. గ్రామ స్థాయిలో రెవిన్యూ అధికార్లు గ్రామాలలో గల ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలు 22ఎ లో నమోదు చేయాలని తెలిపారు. మండల తహశీల్దార్లు సెప్టెంబరు 1 నుండి 10 వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రభుత్వ భూములు, వాటి ప్రస్తుత స్థితి వివరాలను సేకరించాలని తెలిపారు. ప్రభుత్వ భూముల ఆక్రమణను గుర్తించినట్లయితే ఆక్రమణదారులపై తక్షణం కఠిన చర్యలు చేపట్టాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి వెంటనే కౌంటర్లు ఫైల్ చేయాలని, కోర్టునకు సమర్పించిన పిదప అక్నాలడ్జ్మెంటు తీసుకొని, కలెక్టరు కార్యాలయంనకు అందజేయాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి వార్తా పత్రికలలో వచ్చే నెగిటివ్ వార్తలు పై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సదరు నివేదికలను జాయింటు కలెక్టరు కు పంపించాలన్నారు. పత్రికలలో వార్తకు రిజాయండరు జారీ చేయాలని అదికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టరు ఎం. వేణు గోపాలరెడ్డి, జి.వి.ఎం.సి. కమీషనరు జి.సృజన, ఐ.టి.డి.ఎ. పోజెక్టు అధికారి వెంకటేశ్వర్లు, నర్సీపట్నం సబ్ కలక్టరు ఎ.మౌర్య, జిల్లా రెవిన్యూ అధికారి ప్రసాద్, సూపరింటెండెంట్ ఎం .సూర్యకళ ఇతర అధికారులు పాల్గొన్నారు.