టిటిడి ఆసుపత్రుల్లో జనరిక్ మందులు..టిటిడి చైర్మెన్
Ens Balu
10
Tirupati
2020-08-27 18:59:37
టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్విమ్స్, బర్డ్ ఆస్పత్రులలోని మెడికల్ షాపు ల్లో జనరిక్ మందులు మాత్రమే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. బర్డ్ ఆసుపత్రిలో ని జనరిక్ మందుల షాపు ను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఎంఆర్పి ధరలు, రోగులకు ఇస్తున్న ధరలను పరిశీలించారు. ఈ మందులు 50 శాతం దాకా తక్కువ ధరకు వస్తున్నందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. టీటీడీ కి చెందిన ఆసుపత్రుల్లోని అన్ని మెడికల్ షాపుల్లో ఈ మందు లే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జెఈవో బసంత్ కుమార్ ను ఆదేశించారు. టీటీడీ ఆసుపత్రుల్లో కూడా వీటినే ఉపయోగించాలని అన్నారు. ఈ మేరకు అన్ని ఆసుపత్రులకు సమాచారం అందించాలన్నారు. ప్రజలపై మందులు కొనుగోలు భారం పడకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ద్వారా అందించే మందులు నాణ్యమైనవనే నమ్మకం ప్రజల్లో తీసుకురావాలన్నారు. జనరిక్ మందుల వాడకాన్ని మరింతగా పెంచాలన్నారు.