అప్పన్న ఆన్ లైన్ విరాళాలు రూ. 15.45 లక్షలు..
Ens Balu
3
Simhachalam
2021-05-15 12:05:35
విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి చందనోత్సవానికి, ఆన్ లైన్ లో పూజలు నిర్వహించడానికి రూ.15.45లక్షలు విరాళాలు చెల్లించారని దేవస్థాన ఈఓ ఎంవీ సూర్య కళ తెలియజేశారు. శనివారం ఈ మేరకు దేవస్థానం నుంచి చందనోత్సవ ఆదాయంపై ఆమె మీడియాతో మాట్లాడారు. స్వామివారికి భక్తులు తమ గోత్రనామాలు చదవించుకోవడానికి, చందన సమర్పణకు 15 లక్షల 45వేల 630 రూపాయల సమర్పించారన్నారు. ఇందులో గోత్రనామాల పూజలకు 388 మంది రూ.1116 చొప్పున 4,33,008 రూపాయలు పంపారన్నారు. 56 మంది రూ.10,116 చొప్పున అరకేజీ చందన సమర్పణకు రూ.5,66,496 అందించారని తెలియజేశారు. 22 మంది రూ.20,116 చొప్పున కేజీ చందన సమర్పణకు రూ.4,42,552 చెల్లించారన్నారు. మిగతావన్నీ ఆన్ లైన్ డొనేషన్లు రూ. 1,03,574 వచ్చాయని వివరించారు. దేవస్థాన ప్రకటనలో భాగంగా విరాళాలు పంపించనవారికి ఒకటి రెండు రోజుల్లోనే చందన ప్రసాదం పంపిస్తామని పేర్కొన్నారు.. కేజీ చందనం సమర్పించినవారికి శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు. చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు రెండు, మూడు, నాలుగో దఫా చందన సమర్పణకు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు. ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో భాగస్వాములు కావాలనుకునే భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam 11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు 6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా పంపించాల్సి వుంటుందన్నారు. భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.