రూ.8.5 లక్షల ఆక్సిజన్ ఎక్విప్ మెంట్ వితరణ..
Ens Balu
1
ఆంధ్రామెడికల్ కాలేజి
2021-05-18 13:36:18
విశాఖజిల్లాలోని అచ్చుతాపురంలోని ఏసియన్ పేయింట్స్ ప్రభుత్వానికి రూ.8.5లక్షల విలువైన ఆక్సిజన్ ఎక్సిప్ మెంట్ వితరణ చేశారు. వీటిని ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.సుధాకర్ కి అందజేశారు. వీటిలో ఆక్సిజన్ మాస్కులు, సర్క్యూట్ లు, రీఏజెంట్లు తదితర ఎక్విప్ మెంట్ ను అందించారు. కరోనా సమయంలో దాతలు ముందుకి వచ్చి ఇతోదికంగా సహాయం చేయడం శుభపరిణామని ఏఎంసీ ప్రిన్సిపల్ కొనియాడారు. ఇదే స్పూర్తితో మరింత మంది దాతలు ముందుకి వస్తే కరోనా రోగుల ప్రాణాలు కాపాడిన వారవుతారని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏసియన్ పేయింట్స్ జనరల్ మేనేజర్, ఏఎంసీ ప్రొఫెసర్లు పాల్గొన్నారు..