అప్పన్న 2వ విడత చందనం అరగదీత ప్రారంభం..


Ens Balu
1
Simhachalam
2021-05-19 13:37:55

విశాఖలోని సింహాలచంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి(సింహాద్రి అప్పన్న)కు ఈనెల26న రెవండో విడత చందనం సమర్పణ జరుగుతుందని దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ తెలియజేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, వైశాఖి పౌర్ణమి రోజున చందనం సమర్పిస్తారని చెప్పారు. స్వామివారికి సమర్పించే చందనం అగరదిత కార్యక్రమంలో దేవస్థాన ప్రత్యేక ఆహ్వానితులు గంట్లశ్రీనుబాబు పాల్గొని చందనం అరగదీశారని వివరించారు. స్వామివారికి కేజీ చందనం సమర్పించినవారికి (రూ.20,116) శేష వస్త్రం ఇస్తున్నామని చెప్పారు.  చందన సమర్పణ, గోత్ర నామాల పూజలు  మూడు, నాలుగో దఫాలుగా చందన సమర్పణలు కూడా కొనసాగుతాయన్నారు. దాతలు ఎంతైనా స్వామివారికి చందనం సమర్పించుకోవచ్చుని చెప్పారు.  ఆన్ లైన్ పూజలు, అర్చనల్లో  భాగస్వాములు కావాలనుకునే భక్తులు  దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.
సిఫార్సు