కోవిడ్ రోగుల ఆక్సిజన్ కోసం రూ.35 విరాళం..


Ens Balu
3
Collector Office
2021-05-19 13:42:41

విశాఖలోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ  రిఫైనరీ,  జిల్లా లోని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ రోగులకు  ఆక్సిజన్ సరఫరా నిమిత్తము రూ. 35 లక్షలు విరాళంగా అందజేసింది. బుధవారం నాడు స్థానిక కలెక్టరేట్ లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. రత్నరాజ్ చెక్కు ను జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, హెచ్ పిసిఎల్ జనరల్ మేనేజర్ రాజు, పిఆర్ ఓ ఎం. కాళీ, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు పాల్గొన్నారు. కోవిడ్ సమయంలో పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉదారంగా స్పందించడం అభినందనీయమని కలెక్టర్ అభినందించారు.

సిఫార్సు