అప్పన్న ఆలయంలో ధన్వంతరీ హోమం..


Ens Balu
2
Simhachalam
2021-05-21 12:23:43

విశాఖలోని సింహాలచం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి (సింహాద్రి అప్పన్న)వారి దేవస్థానంలో  24న లోకకల్యాణార్ధం, ప్రజారోగ్యం కోసం ధన్వంతరి హోమం - సుదర్శన హోమం చేపడుతున్నట్టు ఈఓ ఎంవీసూర్య కళ చెప్పారు. శుక్రవారం ఈఓ దేవస్థానంలో మీడియాతో మాట్లాడుతూ, సమస్త ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వామికి ఈ హోమాలు చేయడం ద్వారా ఆయన కరుణా కటాక్షాలు ప్రజలకు చేరతాయనే నమ్మకంతో అనాదిగా ఈ హోమాలు చేస్తూ వస్తున్నారని చెప్పారు. దీనికోసం ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. లోక కళ్యాణార్ధం నిర్వహించే ఈ హోమంలో భక్తులు భాగస్వాములు కావచ్చునని చెప్పారు. దానికోసం భక్తులు దేవస్థానం అకౌంట్ UPI ID:9491000635@SBI కుగానీ, ఆన్ లైన్లో SBI అకౌంట్ నంబర్ EO,SVLNS devasthanam  11257208642, IFCS code SBIN0002795కు గాని, కనీసం ఒక రోజు ముందుగా  నిర్ణీత రుసుము చెల్లించి పూజలు చేయించుకోవచ్చునన్నారు.  ఆన్ లైన్ లో డబ్బులు పంపాక తప్పకుండా దాని స్క్రీన్ షాట్ ఫొటో తీసి , మీ పేరు, గోత్రం తదితర వివరాలు  6303800736 నంబర్ కు వాట్సప్, మెసేజ్ ద్వారా  పంపించాల్సి వుంటుందన్నారు.  భక్తుల సందేహాలను కూడా ఇదే నెంబరు ద్వారా నివ్రుత్తి చేసుకోవచ్చునన్నారు.