సర్వేయర్లకు రోవర్స్ తో సర్వేలో శిక్షణ..


Ens Balu
3
Srikakulam
2021-05-27 10:29:32

రోవర్స్ అనే ఆధునిక పరికరంతో భూ సర్వేపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని సర్వే శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర రావు తెలిపారు. ఆధునిక పరికరాలు లభ్యతతో భూ సర్వే సమర్ధవంతంగా చేపట్టవచ్చని ప్రభాకర చెప్పారు. శిక్షణా కార్యక్రమాన్ని ఆర్ అండ్ బి అతిధి గృహం సమీపంలోగల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. సర్వేయర్లు రోవర్స్ వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేసారు. ఒక ప్రాంతంలో రోవర్స్ పరికరం గాలిలో వినియోగించడం వలన ఆ ప్రాంతంలోని భూ సర్వే చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ కె.ఈశ్వర దొర, డిప్యూటి ఇన్ స్పెక్టర్లు జి.వెంకట రావు, సారంగ పాణి, కొండల రావు, మండలాల సర్వేయర్లు పాల్గొన్నారు.
సిఫార్సు