ధ్యాన్ చంద్ మహనీయుడు – కలెక్టర్ జె.నివాస్


Ens Balu
2
Visakhapatnam
2020-08-29 16:58:06

ధ్యాన్ చంద్ మహనీయుడు అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. శనివారం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరి గి న కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నివాస్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడాకా రులకు ధ్యాన్ చంద్ ఎంతో స్ఫూర్తిప్రదాత అన్నారు. దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తి అన్నారు. ధ్యాన్ చంద్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి క్రీడాకారుడు ఉ న్నత స్ధాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. గొప్ప మెలకువలతో హాకీ ఆడిన క్రీడాకారుడని పేర్కొంటూ అంతటి నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ సాధించాలని అన్నారు. ల్లా ఒలింపిక్ భవనానికి ప్రతిపాదనలు అవసరమని జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి పి.సుందర రావు కోరగా అందుకు చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. కార్యక్ర మంలో క్రీడల చీఫ్ కోచ్ బి.శ్రీనివాస కుమార్ తదితరులు పాల్గొన్నారు.