అప్పన్నకు సేవచేసే యోగం రావడం ఎంతో అదృష్టం..


Ens Balu
2
Seethammadara
2021-05-28 09:18:45

దేవాలయాల్లో సేవ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతమని
 రాష్ట్ర  పర్యాటక శాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల సింహాచలం ట్రస్టుబోర్డుకి ప్రత్యేక ఆహ్వానితులు నియమితులైన సభ్యులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో కలిసి మంత్రిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేవాలయాలు అద్యాత్మిక, ప్రశాంతతకు మారు పేరు అని అన్నారు. అంతేకాకుండా ఆ భగవంతుని సేవ చేసుకోవడానికి  సభ్యులకు చక్కని అవకాశం కలిగిందన్నారు.  సభ్యులు దేవున్ని స్మరించుకుంటూ భక్తులకు మెరుగైన సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి అందరు పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు గంట్ల శ్రీసుబాబు , మేడిద మురళీకృష్ణ , దశమంతుల మాణిక్యాలరావు మంత్రికి సింహాద్రినాధుడి జ్ఞాపికను బహుకరించి స్వామివారి శేషవస్త్రాన్ని అందజేశారు.
సిఫార్సు